1, మార్చి 2011, మంగళవారం

గిరిజనుల ఐకమత్యానికి చిచ్చు
-ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్

లంబాడీలను ఎస్‌టి (షెడ్యూల్డ్ ట్రైబ్) జాబితా నుంచి తొలగించాలా? ఎందుకు? లంబాడీలకు ఎస్‌టి హోదాను వ్యతిరేకిస్తున్నవారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక ఇటీవలి కాలంలోనే వారు భారతదేశానికి వలస వచ్చారని ఆరోపిస్తున్నారు. చరిత్ర చెబుతున్నదేమిటో చూద్దాం.

గిరిజన తెగలలో ఒక ఉపకులమైన లంబాడీలు అనబడే గోర్ బంజారాలు క్రీ.శ. ఒకటవ శతాబ్దం కంటే ముందే భారతదేశంలో స్థిరపడ్డారు. ఇందుకు అనేక ఆధారాలున్నాయి. బంజా ర అనే పదం ఒక సంస్కృత పదం నుంచి ఉత్పన్నమయింది. దీనర్థం వనచరులు (ఫారెస్ట్ వాండర్స్). పశుపోషణ వారి జీవనాధారం. కొండలు, అడవులు, పచ్చిక మైదానాలు వారి ఆవాస స్థానాలు. పశువులపైన గోనె సంచులలో ఉప్పు నింపుకొని వస్తు మార్పిడి ద్వారా జొన్నలు, ఇతర తృణ ధాన్యాలను సేకరించుకుంటూ శతాబ్దాలుగా సంచార జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రశాంత ప్రజలు లంబాడీలు లేదా బంజారాలు.

ఆంగ్లేయులు బంజారాలనుLONG BODIES అని పిలిచేవారు. ఆ ఆంగ్ల పదం నుంచి లంబాడి అనే పేరు వచ్చి ఉంటుందనేది ఒక నానుడి. ఇప్పుడు అతి దయనీయమైన బతుకులు వెళ్ళదీస్తున్న లంబాడీలు మధ్యయుగాలలోను, ఆధునిక యుగంలోను దేశచరిత్రలో అవిస్మరణీయమైన పాత్ర నిర్వహించారు. చారిత్రక వాస్తవాలను పట్టించుకోకుండా కొందరు రాజకీయ స్వలాభాపేక్షతో గిరిజనులలో వైషమ్యాలు సృష్టించడం సమంజసమేనా?

శ్రీవెంకటేశ్వరస్వామి మహాభక్తుడు, ఏడుకొండలపై ఒక మఠాన్ని స్థాపించిన బాబా హాతీరామ్‌జీ మహరాజ్ పుట్టుకతోనే భారతీయ గిరిజనుడు. ఏడకొండలస్వామి ఆయన మఠానికి వచ్చి పాచికలు ఆడేవారని ప్రతీతి. ఒక రోజు స్వామివారు తన హారాన్ని మఠంలోనే వదిలి వెళ్ళారు. ఆ హారాన్ని గమనించిన హాతీరామ్‌జీ దాన్ని అధికారులకు చూపించాడు. బాబా మాటలను నమ్మని అధికారులు ఆయన్ని ఒక గదిలో నిర్బంధించారు. 'నీవు నిజాయితీపరుడవయితే 10 కిలోల అన్నం, పది కిలోల చెరకు గడలు ఒక్క రోజులోనే తినాలని' ఆజ్ఞాపించారు. హాతీరామ్ జీ ఐదునిమిషాలలోనే ఆ ఆహార మంతటినీ భుజించారట! ఆయన జీవ సమాధి ఇప్పటికీ తిరుమల తిరుపతిలోని హాతీరామ్ మఠ్‌లో ఉంది.

అనంతపురం జిల్లా గుత్తిలోని గొల్లల దొడ్డి ప్రాంతంలో లంబాడీల కుల దైవమైన సేవాలాల్ మహరాజ్ గఢ్ కలదు. సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించాడు. శివ పూజాపరు డు. ఆయన తండ్రి,తాతలు తెగ పెద్దలు. గుత్తి మండలంలోని గొల్లల గుడి ప్రాంతంలో అఖిల భారత బంజారా సేవాసంఘ్ అధ్యక్షుడు రంజిత్ నాయక్, కిషన్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఇటీవల ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించి, అందులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా ఫిబ్రవరి 15న దేశం నలుమూలల నుంచీ లంబాడి గిరిజనులు పెద్ద సంఖ్యలో గొల్లల గుడికి చేరుకుని పూజలు జరుపుతారు.

ఈ చరిత్రను అలా ఉంచితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 దేశాలలో గిరిజనులు విస్తరించిఉన్నారు. వీరిలో 70 శాతం మంది ఆసియా దేశాలలోనే ఉన్నారు. ప్రత్యేక వేష భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అరుదైన జీవన విధానం ఉండడం వల్ల ఎల్లెడలా వారు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. అn్టౌn్ఛజూజ్చూ ఇౌటఛీౌn్ఛ, ఐఊఅఈట కో-ఆర్డినేటర్ ప్రకారంగా 'Antonella Cordone, IFADs Mø&BÇz¯óþrÆŠÿ {ç³M>Ææÿ…V> "Indigenous Peoples are the Custo dians And Managers of our Natural resources" గిరిజనులను అని అభివర్ణించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అలవర్చుకునే శక్తి గిరిజనులకు మాత్రమే ఉందనేది Antonella Cordoneసునిశ్చిత విశ్వాసం. 1991 జనాభా గణన ప్రకారం దేశ జనాభాలో ఎనిమిది శాతం గిరిజనులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి 645 జిల్లాల్లో షెడ్యూల్డు తెగలు గా ప్రభుత్వంచే గుర్తింపు పొందివున్నారు.

బంజారాలు రాజపుత్రుల లాంటివారని చరిత్రకారుడు కల్నల్ టాడ్ పేర్కొన్నారు. 'పృధ్వీరాజ్ రాసో' కావ్యకర్త చాంద్ బర్దాయి కూడా వారిని రాజపుత్రులని అభివర్ణించారు. లంబాడీలు/ బంజారులు/ సుగాలీలు/ గ్వార్ భాయ్ అని పిలవబడుతున్న ఈ గిరిజనులు ప్రపంచ వ్యాప్తంగా గోర్ బంజారాలు గా వాసికెక్కారు. సూర్య భగవానునిని ఆరాధించే సంప్రదా యం వీరికి ఉంది. మహమ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా పృధ్వీరాజ్ చౌహాన్ పక్షాన పోరాడిన వీరోచిత చరిత్ర ఈ బంజారాలకు ఉంది.

దక్కన్ పీఠభూమిలో లంబాడీలు కాకతీయుల కంటే ముందే ఉన్నారని చరిత్ర చెబుతుంది. సంచార జాతివారైన లంబాడీలు రజాకార్లతో కూడా పోరాడారు. పలువురు నవాబులు వారి ధైర్యసాహసాలను మెచ్చి గ్రామాల భూములను ఇనాములుగా ఇవ్వడం జరిగింది. పోలీసు పటేల్, మాలీ పటేల్ మొదలైన ప్రభుత్వోద్యోగాలలో కూడా నియమితులైన లంబాడీలు చాలా మంది ఉన్నారు.

బంగి-జంగి అనే ఇద్దరు బంజారా సోదరులు మొగల్ సైన్యాలకు ఆహారపదార్థాలు, ఆయుధాలను రవాణా చేస్తూ హైదరాబాద్‌కి చేరుకున్నారు. వారికి 2.30 లక్షల పశువులు ఉండేవి. వాటికి అవసరమైన గ్రాసం కొరకు ప్రస్తుత బంజారాహిల్స్ ప్రాంతాన్ని ఉపయోగించుకోవల్సిందిగా మొదటి అసఫ్‌జాహినవాబు వారికి వ్రాసి ఇచ్చారు. కనుకనే ఆ ప్రాంతం బంజారా హిల్స్‌గా పేరు గాంచింది. బంజారాల సహకారానికి మొదటి నిజాం నవాబు తన రాజముద్రతో స్వయంగా వ్రాసి ఇచ్చిన ఒక ఫర్మానా ఇలా తెలుపుతుంది: 'ఎక్కడ నీరు ఉన్నా, రంజన్లలో ఉన్నా ఉపయోగించుకోవచ్చు; పశువులకు కావలసిన గడ్డి మోపుకోవచ్చు; ర

ోజుకు ముగ్గురిని చంపిన మాఫి; అసబ్ వంశం గుర్రాలు ఎక్కడ ఉంటే దాని ప్రక్కనే జంగి-బంగికి చెందిన పశువులు ఉండవచ్చు'. నల్లగొండ జిల్లాలోని ప్రస్తుత చిట్యాల మండలంలో గల అందుకు తండా ప్రాంతంలో సోమ్లా లే అనే లంబాడా ఉండే వాడు. పేదలను ఆదుకునేందుకు దారి దోపిడీలకు పాల్పడేవా డు. అతన్ని పట్టుకోవడం నిజాం నవాబులకు ఒక సవాలుగా మారింది. అదే ప్రాంతానికి చెందిన మరో లంబాడా అజ్మీరా భీమానాయక్ సహాయంతో సోమ్లాను బంధించి ఉరి తీయించారు. భీమా నాయక్‌కు 32 గ్రామాలను ఇచ్చారు. ఆ గ్రామా ల పాలన బాధ్యతలను అతనికే అప్పగించారు. ప్రస్తుత చల్లగరి గే, గోపాలపురం, సుబ్బక్క పల్లె మొదలైనవి.

వరంగల్ జిల్లాలోని ప్రస్తుత వెంకటాపురం మండలంలోని గుర్రంపేట్ ప్రాంతంలో బండ్ల పహాడ్ అరణ్యాన్ని స్థావరంగా చేసుకొని మూడ్ భార్త్యా, భోప్త్యా అనే లంబాడా సోదరులు నిజాం నవాబుకు ఎదురు తిరిగారు. ఖజానాకు జమ చేసే శిస్తు రూపేణా ఇచ్చే నాణాలను దొంగిలించారు. ఈ సోదరులను ఎవరూ పట్టుకోలేకపోయారు. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఆ సోదరుల కులానికే సంబంధించిన పోరిక వంశస్తులను పిలిపించి భార్త్య, భోప్త్యాలను మీరే పట్టించాలని వారి పై ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను తట్టుకోలేక ఆ సోదరులను పట్టుకోవడానికే వారు నిర్ణయం తీసుకున్నారు.

గుర్రంపేటకు సమీపాన గల ఎంగ్లాస్‌పురం అనే తాటివనానికి వారిని పిలిపిం చి, తాగించి, బంధించి నవాబుకు అప్పగించారు. మహబూబ్ అలీ వారి ప్రభు భక్తికి మెచ్చుకున్నారు. పోరిక వంశస్తులకు 23 ఎకరాల భూమిని, రెండు బ్రాందీ సీసాలను ఇనాముగా ఇచ్చారు.

ఈ బంజారాలు ఎవరికి హాని తలపెట్టేవారు కాదని, సహాయగుణం కలవారని, ధైర్య సాహసాలు కలవారని రాజాధీశులు వారి సేవలను కొనియాడి గ్రామాలు, భూములను ఇనాములు గా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ భూములు లంబాడాల అధీనంలోనే ఉన్నాయి. గోర్ బంజారాలు (లంబాడీలు) భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ట్రైబల్స్‌గా ఉన్నారనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేమి కావాలి?

ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం కోస్తా, రాయలసీమ జిల్లా ల్లో ఉన్న లంబాడీలు షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీల)లుగా గుర్తింపు పొంది ఉన్నారు. అయితే నిజాం పాలనలోని లంబాడీలు ఎస్టీలుగా గుర్తింపు పొందలేదు. వారి జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఇరవై సంవత్సరాల కు ఈ పరిస్థితులు మారాయి. ఒకే రాష్ట్రంలో ఉన్న ఒకే తెగకుచెందిన బంజారాలు ఒక ప్రాం తంలో ఎస్టీలుగా, మరో ప్రాం తంలో డీ నోటిఫైడ్ ట్రైబ్స్‌గా ఉండడాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించింది.

అప్పటి కేంద్ర హోం మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు శ్రీమతి ఇందిరాగాంధీ సానుకూలంగా స్పందించారు. AREA RESTRICTION REMOVAL BILL కేంద్ర కేబినెట్‌లో ఆమోదించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 108/ 1976 చట్టం ప్రకారం తెలంగాణ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చా రు. ఇందుకు మాజీ ఎంపి రవీందర్ నాయక్, వాగ్యా నాయక్ తదితరులు విశేష కృషి చేశారు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో 60 లక్షలకు పైగా గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులు 33 తెగలుగా (ఇంకో రెండు తెగలను చేరుస్తున్నట్లుగా తెలిసింది) విభజింపబడి ప్రత్యేక జీవన విధా నం, సంస్కృతీ సంప్రదాయాలను కలిగియున్నారు. వీరు ఏజె న్సీ ప్రాంత గిరిజనులుగా, కొండ ప్రాంత గిరిజనులుగా, మైదా న ప్రాంత గిరిజనులుగా స్థిరపడియున్నారు. రాష్ట్రంలో ఏజన్సీ ప్రాంతంలో కంటే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల శాతం ఎక్కువ.

రిజర్వేషన్ అనేది ఒక సామాజిక నేపథ్యం. తరతరాలుగా జాతి వివక్షకు గురవుతూ, ఆర్థిక, రాజకీయ సామాజికాభివృద్ధికి దూరంగా ఉన్నవారి మధ్య అంతరాలను తొలగించి వారి అభివృద్ధికి తోడ్పడానికే రిజేర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. షెడ్యూల్డు ట్రైబ్ అనేది ఎవరూ కూడా తమపేటెంట్ హక్కుగా భావించకూడదు. రాజ్యాంగబద్ధంగా ఎస్ టి జాబితాలో ఉన్న వారిని తొలగించండి అనే హక్కు ఎవరికీ లేదు. ప్రాచీన కాలం నుంచి బంజారాలు భారత్‌లో ఉన్నట్టు చరిత్ర స్పష్టం చేస్తోంది. అయినా కొందరు మా ఉపకులాల మధ్య సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు వాస్తవాలను గుర్తించి బంజారాల ఉన్నతికి తోడ్పడాలి.

-ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్
కాకతీయ విశ్వవిద్యాలయం

పైన పటారం - సంపాదకీయం

పైన పటారం
- సంపాదకీయం

ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2011-12 వార్షిక బడ్జెట్‌లో అపారమైన ఆయన రాజకీయ అనుభవం, రాజనీతిజ్ఞత కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. పైకి పూర్తిసాదా సీదాగా, గొప్ప సృజనాత్మకత ఏదీ లేనట్టుగా కనిపిస్తున్న ఈ బడ్జెట్‌లో ప్రణబ్ దాదా లౌక్యం, గడుసుదనం అంతర్లీనంగా దాగి ఉన్నాయి.

యు.పి.ఎ. ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకోవడంలో ఆయన తనదైన చాణక్యాన్ని ప్రదర్శించారు. మార్కెట్ సంస్కరణల మోజును బాహాటంగా ప్రదర్శించి జనాగ్రహానికి గురికాకుండా, జనాకర్షణకు పెద్దపీటవేసి మార్కెట్ శక్తుల నిరసన ఎదుర్కోకుండా... సమతుల్యాన్ని ప్రదర్శించేందుకు అసిధారా వ్రతాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు.

వేతన జీవులకు పన్ను మినహాయింపు పరిమితిని లక్షా అరవై వేల రూపాయ ల నుంచి లక్షా ఎనభై వేల రూపాయలకు పెంచారు. ఈ నామమాత్రపు పెంపుద ల వల్ల ఉద్యోగులకు ఒనగూడే లాభం కేవలం నికరంగా రెండు వేల రూపాయ లు మాత్రమే. గత ఏడాది కాలంలో అసాధారణస్థాయిలో దూసుకుపోయిన ధరలు మధ్యతరగతి జీవితాన్ని దుర్భరం చేశాయి. పెరిగిన జీవన వ్యయంలో ఈ రెండు వేలు ఏ పాటి అన్న విషయం ఆలోచించాలి. పన్నుల మినహాయింపునకు సంబంధించి కొత్తగా సృష్టించిన అతి వయోవృద్ధుల విభాగం వల్ల ఎంతమంది లబ్ధిపొందుతారో చూడాల్సి ఉంది.

80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు ఐదు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పరిమితిని ప్రణబ్ ప్రకటించారు. అంగన్‌వాడి ఉద్యోగుల వేతనాలను ఏకంగా నూరు శాతం మేర పెంచా రు. సామాజిక రంగాల వ్యయాన్ని 17 శాతం మేర పెంచుతున్నట్టుగా వెల్లడించారు.

80 ఏళ్లు దాటిన వృద్ధుల పింఛనును 200 రూపాల నుంచి 500 రూపాయలకు హెచ్చిస్తున్నట్టుగా వెల్లడించారు. విద్య, వైద్యం వ్యయాన్ని కూడా గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులను పెంచారు. గ్రామీణ గృహనిర్మాణ నిధిని 3000 కోట్ల రూపాయలకు పెంచారు. ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. స్థూలదృష్టికి ప్రజాకర్షక బడ్జెట్‌గా ముస్తాబు చేసినట్టు కనిపిస్తు న్నా, సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు మధ్యతరగతి నడ్డి విరిచే అవకాశం ఉంది.

సగటు జీవుల బతుకులను దుర్భరం చేసిన నిత్యావసరాల ధరలు, దేశీయ ఆర్ధిక రంగాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ ముడి చమురు ధర లు, జాతి ప్రజలందరి ఆగ్రహానికి కారణంగా మారిన అవినీతి, న్యాయస్థానాలు సైతం పరుషంగా వ్యాఖ్యానిస్తున్న నల్లధనం... వీటి విషయంలో స్పష్టమైన కార్యాచరణ ఏదీ బడ్జెట్‌లో కానరాలేదు. వ్యవసాయం, మౌలిక వసతుల రంగం, గృహనిర్మాణం వీటికి ప్రాధాన్యం లభించింది.

ఆర్ధిక రంగంలో కార్యకలాపాల జోరు కొనసాగాలంటే మౌలిక వసతులు, గృహనిర్మాణ రంగాల్లో వ్యయం తప్పనిసరి. వేడిని రాజేసే ఈ రంగాలకు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తూ అదే సమయంలో ఈ ఏడాది మొదటిసారిగా 5 శాతంపైగా వృద్ధి రేటుతో భారత ఆర్థిక రంగానికి వెనుదన్నుగా నిలిచిన వ్యవసాయంపై కూడా ఆర్థిక మంత్రిగా గట్టిగా దృష్టిసారించారు. వ్యవసాయరంగానికి అందులోనూ భారత రైతాంగానికి ఆయన ఏం మేలు చేయబోతున్నారనే దానికంటే కూడా వ్యవసాయరంగంలో కార్పొరేట్ల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నారన్న విషయం విస్పష్టంగా కనిపిస్తున్నది. కార్పొరేట్ ఉనికి పొలంగట్ల వరకు చేరింది.

ఇక పొలాల్లోకి ప్రవేశించమే తరువాయిగా కనిపిస్తున్నది. నిజానికి ఈ బడ్జెట్‌లో స్టాక్ మార్కెట్‌లను ఘనంగా అలరించే అంశాలు ఏమీ లేవు. అయితే గత కొద్దికాలం గా మార్కెట్‌లో కనిపిస్తున్న నీరస వాతావరణంలో ప్రతికూల అంశాలు పెద్దగా లేకపోవడమే బడ్జెట్‌లో సానుకూల అంశంగా భావించి స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు పెరిగినట్టుగా కనిపిస్తున్నది. ఇది తక్షణ స్పందనగానే భావించాలి.

బడ్జెట్ ప్రతిపాదనల ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మార్కెట్ల స్పందనలో తేడా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యలోటు అదుపునకు సంబంధించి, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్థికమంత్రి లక్ష్యాలు ఎంతవరకు ఆచరణ సాధ్య మో వేచిచూడాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మన చేతు ల్లో లేవన్న విషయం విషయం గుర్తించాలి. అదే విధంగా మధ్య ఆసియాలోని సంక్షోభ పరిస్థితులు కూడా. వీటి ప్రభావం నుంచి దేశీయ ఆర్ధికరంగం తప్పించుకోవడం సాధ్యం కాదు.

మార్కెట్ వర్గాలు గట్టిగా కాంక్షించిన సంస్కరణల విషయంలో కూడా ఆర్ధిక మంత్రి చొరవ తీసుకోలేదు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయం, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపరిమితిని పెంచే విషయం ప్రస్తుతానికి దాటవేశారు. రాబడిని పెంచుకునేందుకు సర్వీసులరంగంపై పడ్డారు. పన్నును పెంచకుండానే కొత్త సర్వీసులను పన్ను పరిధిలోకి తెచ్చారు.

ఎయిర్ కండిషన్ బార్లు, ఆస్పత్రులు, హోటళ్లు, రోగనిర్ధారణ సర్వీసులను పన్ను పరిధిలోకి తెచ్చిన కారణంగా ఈ భారం అనివార్యంగా మధ్యతరగతిపైనే పడుతుంది. ఎక్సైజ్ సుంకాల విషయంలోనూ ఉపేక్షిస్తున్నట్టుగా పైకి కనిపిస్తూనే వడ్డనలకు దిగారు. కేంద్ర ఎక్సైజ్, రాష్ట్రాల వాట్ నుంచి మినహాయింపు ఉన్న 130 వస్తువులను పన్ను పరిధిలోకి తెచ్చారు. ఎక్సైజ్ సుంకాల గరిష్ఠ పరిమితిని 10 శాతంగా కొనసాగిస్తూనే కనిష్ఠ పరిమితిని 4 నుంచి 5 శాతానికి హెచ్చించారు.

ఇటీవల కాలంలో విస్తృత వినియోగంలోకి వచ్చిన రెడిమేడ్ దుస్తుల పరిశ్రమను పన్ను పరిధిలోకి తెచ్చారు. ఎరువులు, ఎల్‌పిజి, కిరోసిన్‌కు సబ్సిడీలను నగదురూపంలో బదిలీ చేయాలన్న విధానం భవిష్యత్తులో మధ్యతరగతిని సబ్సిడీలకు దూరం చేస్తుంది. కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే సబ్సిడీలను నగదు రూపంలో అందజేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో ఇది పెను భారమే చూపించే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా ప్రణబ్ దాదా బడ్జెట్ పైకి కనిపిస్తున్నంత జనాకర్షకం మాత్రం కాదు.

boi bimann rachanalu

డా॥బోయి భీమన్న సుమారు 70 పుస్తకాల్ని రాసినట్లు తెలుస్తుంది. పద్య,గేయ,వచన రచనలతో పాటు, నాటకాలను కూడా రాశారు. వివిధ పుస్తకాలకు రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది.వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది.ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని రాశారు. వీటన్నింటితో పాటు అంబేద్కర్‌ రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశారు.వీరు రాసిన ‘‘జయ జయ జయ అంబేడ్కర!’’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతుంది.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డా॥బోయి భీమన్నపేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, వీరి రచనలన్నింటినీ ప్రచురిస్తున్నారు.నిజానికివన్నీ విశ్లేషిస్తే గాని,భీమన్న సమగ్ర సాహిత్య దృక్పథం స్పష్టం కాదు.ఈయనే కాదు, ఏ రచయిత దృక్పథాన్నైనా అంచనా వేయాలంటే, వివిధ పరిణామాలుగా సాగిన రచనలన్నింటినీ స్పర్శించగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అలా కాకుండా, దళిత పదాన్ని ప్రయోగించలేదనీ, దాన్ని వ్యతిరేకించాడనీ, భారతదేశంలో కులం లేదన్నారనీ, ఆయన వర్గాన్నే సమర్ధించారనీ, కులం గురించి రాయలేదనీ వక్రీకరించే వాళ్ళుని చూసిన తర్వాత ఆయన సాహిత్యదృక్పథాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. 
ఇప్పటికే అనేకమంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ ఒక మార్గదర్శనాన్ని కల్గించిన గ్రంథం ఒకటి ఉంది. అది శ్రీమతి హైమావతీ గారు చక్కని కథనాత్మక శైలిలో రాసిన ‘‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న’’ గ్రంథం. ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దానిలోని సూచనల్ని గమనిస్తే,ఆయన రాసిన రచనల్లో పరిశోధకులకు,విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది.భారతదేశంలోని భిన్నత్వంలోని ఏకత్వంలాగే, భీమన్న రచనల్లోనూ ఆ లక్షణం కనిపిస్తుందనీ, ఆయన కుల,మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది అనీ ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది.
భారతజాతీయదృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించుకోవాలి.అంబేద్కర్‌ విశ్లేషించిందీ,భీమన్న రాసిందీ అదే! తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నారు.జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయవాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది.
ఒకప్పుడు ‘‘బ్రాహ్మణ’’ శబ్దాన్ని చదువుకున్నవాళ్ళకీ, ఆలోచనాపరుల్నీ సూచించడానికీ ప్రయోగించారు.సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణవ్యవస్థలోకి చేరిన తర్వాత కులసూచికగా మారిపోయింది. తమ తెలివితేటలతో ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, క్రమేపీ ఒక వర్గంగా తయారైయ్యారు.ఈ ఆలోచనాపరులు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మతమని ప్రబోధిస్తూనే, ఆచార, వ్యవహారాల పేరుతో, కర్మ సిద్ధాంతం వైపు నడిపించుకొనిపోయిన హిందూమతంపైనే డా॥ అంబేద్కర్‌ ముందుగా తన దృష్టిని కేంద్రీకరించారు.కొన్ని వందలసంవత్సరాలుగా పాతుకుపోయిన హిందూమతంతో అవినాభావసంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు, తమకు బోధించిన ధర్మశాస్త్రాల వల్ల మానసికంగా, అస్పృశ్యులుగా ఉండిపోవడానికైనా సిద్ధపడతారు. పురాణేతిహాసాలు,సంప్రదాయ సాహిత్యాల పేరుతో పాలకవర్గాలతో ‘‘ఆలోచనాపరులు’’ కలిసి కొనసాగించిన కుట్ర ఫలితంగా, నేటికీ కులాధిపత్యసాహిత్యమే ఉత్తమసాహిత్యంగా కొనసాగిపోతోంది. దురదృష్టమేమిటంటే, నాటిభావజాలాన్ని నేటికీ కొనసాగించడాన్ని ఆ భావజాలం వల్ల నష్టపోయిన, ఇంకా నష్టపోతున్న వాళ్ళు వ్యతిరేకిస్తుంటే, నాటి ఆధిపత్య భావజాలానికి ప్రతినిధుల్లా వాటిని సమర్ధించేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అందుకనే తన ప్రజలంతా దేని వల్లనైతే మోసపోతున్నారో, దాన్నుండి రక్షించుకోవడానికి ప్రత్యక్షంగా సామాజిక ఉద్యమాన్ని నడిపే బాటలో పయనించిన వాడు అంబేద్కర్‌. అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయిభీమన్న కూడా!
డా॥బోయిభీమన్న సమగ్రసాహిత్యం పేరుతో మొదటి సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలే విడుదల చేశారు. దీనిలో ‘‘పాటలలో అంబేద్కర్‌’’ (పుటలు : 306 - 462 ) ఉంది. దీనిలో అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని,భావజాలాన్ని వర్ణించిన 118 పాటలున్నాయి.దీనిలోనే భీమన్న అనేక పాటల్లో దళిత పదాన్ని ప్రయోగించారు. కానీ, దళిత పదాన్ని వాడడం ఇష్టం లేదని ఆయన తన చివరి రోజుల్లో ప్రకటించారు.దానికి అనేక కారణాలున్నాయి. దాన్ని మరోసారి చర్చించుకుందాం.‘‘దళిత జనులకంబేడ్కరు, ధర్మమె మతమన్నాడు, బౌద్ధధర్మమొకటేరా,భారతీయమన్నాడు’’అని ఒక చోట, ‘‘ దళితులనుద్ధరించని ధర్మం కుంటిదంటూ..’’ ఒక పాటకు దళిత పదాన్ని శీర్శికలోనే పెట్టిమరీ మరోచోట రాశారు.దళితుల్ని ఈయన అవర్ణులు, పంచములు, హరిజనులనే పేర్లతో వర్ణించడం కనిపిస్తుంది. 
కులనిర్మూలనను బలంగా వ్యతిరేకించిన నాటకం పాలేరు. 1988 నాటికి పాలేరు నాటకానికి ఏభై యేళ్ళైందని రచయితే చెప్పుకున్నారు. అంటే, ఆ నాటకం 1938లో రాసినట్లు స్పష్టమవుతుంది.
 భీమన్న రాసిన ‘‘పాలేరు’’ నాటకంలో వెంకన్నావనబాలల ప్రేమకథలోను,1959లో రాసిన ‘‘రాగవాసిష్ఠం’’ నాటకంలో గల అరుంధతీావశిష్ఠుల ప్రణయగాథలోను, మరికొన్ని రచనల్లోను కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించారు.





 
సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజంలో అవమానాలకు గురౌతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు. పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవమర్యాదల్ని పొందుతున్న అమ్మాయిని పెండ్లి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు గురికావాల్సివస్తుందో, అన్నింటినీ అగ్రకుల, భూస్వామి కుభేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు.చివరికి ‘‘ఉపకారి’’ మాస్టారు సహాయంతో చదువుకుని వెంకటేశ్వరరావుగా గౌరవం పొంది,డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతోద్యోగం సాధిస్తాడు.ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి, భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళనీ, ప్రోత్సాహించేవాళ్ళనీ నిరోధిస్తాడు. ప్రజాస్యామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్‌ ఆశయాన్ని దీని ద్వారా ప్రేరేపించారు రచయిత.
సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదనీ, మంచివాళ్ళూ ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం.ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుంటుంబం నుండే వచ్చినా,సంకుచిత మూర్ఖకులతత్వ వాదులు లేని వాళ్ళూ ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు.
వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తానూ పయనించి, తన కొడుకునీ పాలేరుతనానికి పంపుతాడు.అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమను కల్పించి, కొన్ని తరాలుగా కర్మసిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణభూస్వాములు వంచించిన తీరుతెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు.
          నిజజీవితంలో అటు అంబేద్కర్‌, ఇటు భీమన్న ఇరువురి జీవితాల్నీ పాలేరు నాటకం స్ఫురింపజేసేటట్లుంది. ఇరువురూ కులం వల్ల అనేక అవమానాల్ని ఎదుర్కొన్నవాళ్ళే. ఇరువురూ చదువుకోవడం వల్లనే అనేకమంది దళితులకి ఆదర్శం కాగలిగారు. యాదృచ్ఛికంగా ఇరువురూ కులాంతర వివాహాలనే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని నిజజీవితంలో ఆచరించి చూపి మరీ ఆదర్శవంతులైయ్యారు.
రాగవాసిష్ఠంలో అరుంధతీదేవి మాహాత్మ్యాన్ని వివరించడానికి, పురాణేతిహాసాల్లోని కులాంతర వివాహాల్ని సృజనీకరణ ప్రతిభతో భారత జాతీయదృక్పథాన్ని ప్రదర్శించారు. దీనికి ఆర్యద్రావిడ వాదాల్ని కూడా నాటకంలో అంతర్భాగం చేశారు.
సనాతన సంప్రదాయవాది భావాల్ని ‘‘ప్రాచీనుడు’’ అనే పాత్ర ద్వారా వర్ణించారు.నిష్కళంకమైన ప్రేమకు సంప్రదాయం ఎలా అడ్డంకిగా మారుతుందో వివరిస్తూనే, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే, అన్నింటినీ జయిస్తుందని నిరూపించారు.కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు తోడ్పడతాయని చెప్పినట్లైనా, తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లల సామాజిక స్థితి గతుల్ని చర్చించవలసిన అవసరం ఉంది. నేడు కులాంతర వివాహాలు జరిగినా, మళ్ళీ తండ్రిది గానీ, తల్లిదిగాని కుల గుర్తింపేవస్తే, కులనిర్మూలన జరిగినట్లెలా అవుతుందో ఆలోచించాల్సిందే!
‘‘గుడిసెలు కాలిపోతున్నై’’ (1973) కావ్యంలో ఏడాదికోసారి దళితుల గుడిసెలెందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్తగుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్లకోసం వచ్చేవారిని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తుంది. చీమలను శ్రామిక దళితులకు, పాములను కులదోపిడీదారులకు ప్రతీకలుగా చేసి దానిలో వర్ణించారు. దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యత ప్రబోధిస్తారు. తమని ‘‘కూలిరాజు’’ (1946) నాటకంలో కులంతో పాటు ఆర్థికాంశాల్ని కూడా స్పర్శించారు.‘‘ధర్మం కోసం పోరాటం’’’లో బహుజనులంతా రాజ్యాధికారదిశగా పయనించడానికి సూచనలు చేశారు.
వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ, వాళ్ళు రాసిన భారత, రామాయణ, భారతాలు తమవేనని చెప్పడంలో భీమన్న దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. 
హింసావాదానికి భీమన్న వ్యతిరేకి. దళితులందరూ శ్రామికులనే వారిని భీమన్న వ్యతిరేకించారు. కమ్యూనిస్టుపార్టీలో పనిచేసి, కులం, వర్గం వేరని వాదించిన కోనాడ సూర్యప్రకాశరావుకి పాలేరు నాటకాన్ని అంకితమిచ్చారు. భీమన్న రచనల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మూడు ప్రధానాంశాల్ని గుర్తించాలి. ఆర్య`అనార్య సిద్ధాంతాన్ని అంబేద్కర్‌ ఆలోచనతోనే రాగవాసిష్ఠంలాంటి నాటకాన్ని రాశారు. రెండవది వర్ణం విషయంలో భారతదేశంలో కులమనే అవగాహన చేసుకోవాలి. ఇది ప్రపంచదేశాలన్నింటికీ సమన్వయించినప్పుడు కుదరదు. దీన్ని కూడా అంబేద్కర్‌ ఆంత్రోపాలజీ, సామాజిక శాస్త్రాల్ని ఆధారంగా చేసుకుని చెప్పిన సిద్ధాంతమే. దీన్నే భీమన్న కూడా తన రచనల్లో సమన్వయించారు. పాలేరు నాటకానికి రాసిన ముందుమాటలో భీమన్న స్పష్టంగానే వర్గం,కులం పట్ల తన అభిప్రాయాల్ని ప్రకటించారు.‘‘భారత్‌లో వర్గపద్ధతి ( class) లేదు. వర్ణవ్యవస్థ అంటే కుల వ్యవస్థ (caste system system) వుంది. ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి’’ అన్నారు. వర్గపోరాటాలు జరుగుతున్న తీరుని విమర్శిస్తూ ‘‘ నాయకులంతా దేశీయ స్థితిగతులను గుర్తించకుండా ప్రపంచ కార్మిక దృష్టిమాత్రమే కలిగిన ధనిక సవర్ణులు’’ అని ప్రకటించారు.ఇంత స్పష్టంగా కులనిర్మూలనను ఆశించిన భీమన్న సాహిత్యాన్ని వివిధ జాతీయసదస్సుల్లో కులం లేదన్నారని వక్రీకరిస్తున్నారు. మూడవది వర్ణాంతవివాహాల వల్ల కులనిర్మూన జరగడాన్ని ఆకాంక్షించారు. ఈ విషయాలన్నీ బాధ్యతగల సాహితీవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఉంది.అంబేద్కర్‌ భావజాలానికి సాహిత్య ప్రతిఫలనమే భీమన్న సాహిత్యమని గుర్తించాల్సి ఉంది.  
-డా.దార్ల వెంకటేశ్వరరావు